Sunday, January 26, 2014

అవార్డులు - రివార్డులు


భారతరత్న:
క్రీడాకారుడు సచిన్‌టెండ్కూలర్(40), ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్‌ఆర్ రావు(79)లకు ప్రతిష్ఠాత్మక భారతరత్న అవార్డులకు ఎంపికయ్యారు. భారతరత్నను చివరిసారిగా 2009లో పండిట్ భీమ్‌సేన్ జోషికి ప్రదానం చేశారు. ఇప్పటి వరకు ఈ అవార్డును మొత్తం 41 మంది అందుకున్నారు. ఈ అత్యున్నత పురస్కారాన్ని 1954లో ఏర్పాటు చేశారు. సర్. సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత భారతరత్నకు ఎంపికైన మూడో శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావు. ఈ అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు, అతిపిన్న వయస్కుడిగా సచిన్ గుర్తింపు పొందాడు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు :
తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం- స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

ఆసియా నోబెల్ ఫ్రైజ్ ఏర్పాటు :
తైవాన్ వ్యాపారవేత్త సామ్యూల ఇన్ ఆసియా నోబెల్‌గా పేర్కొనే ‘ట్యాంగ్ ఫ్రైజ్’ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఈయన 101 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. 2014లో ప్రారంభమయ్యే ఈ బహుమతిని ప్రతి రెండేళ్లకోసారి ఇస్తారు. ప్రతి కేటగిరిలో విజేతకు 1.7 మిలియన్ డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం నోబెల్ విజేతకు 1.2 మిలయన్ డాలర్లు ఇస్తున్నారు.

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు :
2013 సంవత్సరానికి 58వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను జనవరి 21న ముంబైలో ప్రదానం చేశారు.
వివరాలు :
మలాలాకు ఫ్రాన్స్ పురస్కారం :
పాకిస్థాన్ సాహస బాలిక, మానవ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్(15)కు ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం ‘సైమన్ డీ జేవియన్’ దక్కింది.
బెనగళ్‌కు అక్కినేని అవార్డు :
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగళ్‌‘2012 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు’కు ఎంపికయ్యారు. 2005లో నెలకొల్పిన ఈ అవార్డును తొలిసారి ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్‌కు ప్రదానం చేశారు. 2011లో బాలీవుడ్ నటి హేమామాలినికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

85వ ఆస్కార్ అవార్డులు :
85వ ఆస్కార్ అవార్డులును అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఫిబ్రవరి 25న ప్రదానం చేశారు. భారతీయ కథా నేపథ్యంలో రూపొందించిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రం నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రం- ఆర్గో, ఉత్తమ దర్శకుడు- ఆంగ్ లీ(‘లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ నటుడు- డేనియల్ డే లూయిస్(లింకన్), ఉత్తమ నటి- జెన్నిఫర్ లారెన్స్(సిల్వర్ లైనింగ్ ప్లేబుక్), ఉత్తమ ఛాయక్షిగహకుడు- క్లాడియో మిరండా( లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ ఒరిజినల్ స్కోర్- మైఖెల్ డానా (లైఫ్ ఆఫ్ పై), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్- లైఫ్ ఆఫ్ పై, షార్ డైరెక్టర్ ప్రసాద్‌కు నాయుడమ్మ అవార్డు
ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2013కు గాను షార్ డైరెక్టర్ డా. ఎం.వై.ఎస్ ప్రసాద్‌కు లభించింది.
పాల్ హన్‌సేన్‌కు వరల్డ్ ప్రెస్ ఫొటోక్షిగఫీ అవార్డు
స్వీడన్ ఫొటో జర్నలిస్ట్ పాల్ హన్‌సేన్‌కు 2012ను గాను వరల్డ్ ప్రెస్ ఫొటోక్షిగఫీ అవార్డ్ గెలుచుకున్నారు. ఇది ఫొటో జర్నలిస్టులకిచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక పురష్కారం. 2012లో గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లో చిన్నపిల్లలు మృతిచెందిన దృశ్యాన్ని చిత్రీకరించిన పాల్‌కు ఈ అవార్డు దక్కింది.

ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వ చలన చిత్ర అవార్డులు :
ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం 2011 సంవత్సరానికి చలన చిత్ర అవార్డులను మార్చి 24న ప్రకటించింది.
1. ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు - అమితాబ్ బచ్చన్
(బాలీవుడ్ నటుడు)
2. బీఎన్‌డ్డి ఆత్మీయ అవార్డు - శ్యామ్‌బెనగళ్(దర్శకుడు)
3. నాగిడ్డి - చక్రపాణి జాతీయ అవార్డు- జి. ఆదిశేషగిరి
రావు(నిర్మాత, పద్మాలయ స్టూడియోస్ అధినేత)
4.రఘపతి వెంకటయ్య అవార్డు - కైకాల సత్యనారాయణ
గమనిక : ఎన్టీఆర్ అవార్డు కింద రూ. 5 లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, మిగిలిన అవార్డుల కింద రూ. 2 లక్షలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.
జాతీయ చలనచిత్ర అవార్డులు
-మార్చి 18న 2012 సంవత్సరానికిగాను 60వ జాతీయ చనలచిత్ర అవార్డుల విజేతలను ప్రముఖ దర్శకుడు బసు చటర్జీ
నేతృత్వంలోని జ్యూరీ ప్రకటించింది.
-ఉత్తమ చిత్రం: పాన్‌సింగ్‌తోమర్ (హిందీ-దర్శకుడు: తిగ్మాంషూ ధూలియా)
-ఉత్తమ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ (హిందీ చిత్రం పాన్‌సింగ్‌తోమర్), విక్రమ్ గోఖలే (మరాఠీ చిత్రం అనుమతి)
-ఉత్తమ నటి: ఉషా జాదవ్ (మరాఠీ చిత్రం ధాగ్)
-ఉత్తమ జనరంజక చిత్రాలు: విక్కీడోనర్ (హిందీ), ఉస్తాద్ హూటల్ (మలయాళం)
-ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం - ఈగ
-తెలుగులో ఉత్తమ చిత్రం- ఈగ

ఉత్తమ పార్లమెం అవార్డులు
2010, 2011, 2012 సంవత్సరాలకు ఉత్తమ పార్లమెం పురస్కారాలను లోక్‌సభ స్పీకర్ కార్యాలయం మార్చి 6న ప్రకటించింది
-2010: అరుణ్ జైట్లీ(బీజేపీ)
-2011: కరణ్‌సింగ్ (కేంవూదమాజీ మంత్రి, కాంగ్రెస్)
-2012: శరద్ యాదవ్ (జనతాదళ్-యూ)
1995 నుంచి ప్రతి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఉత్తమ పార్లమెం పురస్కారాన్ని అందజేస్తున్నారు.

సైనా నెహ్వాల్‌కు ‘యుధ్‌వీర్’ అవార్డు :
బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్‌కు 2013 సంవత్సరానికి ‘యుధ్‌వీర్’ అవార్డు లభించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి క్రీడాకారిణి సైనా నెహ్వాల్. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సాధించిన ఘనతకు సైనాకు ఈ అవార్డు దక్కింది.

రావూరికి జ్ఞానపీఠ్ :
ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు 48వ జ్ఞానపీఠ్ అవార్డు-2012 దక్కింది. ఆయన రాసిన ‘పాకుడురాళ్లు’ నవలకుగాను ఈ పురస్కారం లభించింది. తెలుగులో జానపీఠ్ పురస్కారాన్ని దక్కించుకున్న మూడో వ్యక్తి భరద్వాజ. ఇంతకు మందు 1970లో విశ్వనాథ సత్యనారాయణ,1988లో సి. నారాయణడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రం, రూ. 7లక్షలు బహూకరిస్తారు. 2011 సంవత్సరానికి ఒడిశా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్‌కు ఈ పురస్కారం లభించింది.

బుకర్‌ఫ్రైజ్ :
ప్రతిష్ఠాత్మక బుకర్‌ఫ్రైజ్ అమెరికా రచయిత్రి లిడియా డేవిస్‌ను వరించింది. ఈ పోటీలో భారత్‌కు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత యూఆర్ అనంతమూర్తి తుదివరకు పోటీలో ఉన్నా బహుమతి మాత్రం డేవిస్‌కే దక్కింది.

మిస్ ఇండియా వరల్డ్‌గా నేహాల్
భారత సంతతికి చెందిన బ్రిటన్ వనిత నెహాల్ బొగైటా మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌గా ఎంపికైంది. ఈ టైటిల్‌ను సాధించిన మొదటి బధిర యువతిగా ఆమె రికార్డు సృష్టించింది.

రాజీవ్ ఖేల్త్న్ర :
2013 సంవత్సరానికి సంబంధించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించింది.
ప్రతిష్ఠాత్మక క్రీడా అవార్డు రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర షూటర్ రంజన్ సోధీకి దక్కింది. సోధి 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజిత పతకాలు, 2012 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు.
పేరు క్రీడ
విరాట్ కోహ్లి క్రికెట్
చక్రవోల్ సువుఉరో అర్చరీ
రంజిత్ మహేశ్వరీ అథ్లెటిక్స్
పీవీ సింధు బ్యాడ్మింటన్
కవితా చాహల్ బాక్సింగ్
సాబా అంజుమ్ హాకీ
రాజ్‌కుమారీ రాథోర్ షూటింగ్

2012-13 సంవత్సరానికి బీసీసీఐ అవార్డులు :
భారత్ క్రికెట్ నియంవూతణ బోర్డు (బీసీసీఐ)2012-13 సంవత్సరానికి 7వ వార్షిక అవార్డులను 2013 డిసెంబర్ 26న ప్రకటించింది.
సీకే నాయుడు అవార్డు(లైఫ్ టైం అచీవ్‌మంట్ అవార్డు) కపిల్‌దేవ్(రూ.25 లక్షల బహుమతి)
పాలిఉమిగ్రర్ పేరిట ఇచ్చే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్’:
ఆర్. అశ్విన్(రూ.5లక్షల బహుమతి)
రంజీవూటోఫీలో ఉత్తమ ఆల్‌రౌండర్‌కిచ్చే ‘లాలా అమర్‌నాథ్’: అభిషేక్ నాయర్
ఉత్తమ అంపైర్ : శంషుద్దీన్(హైదరాబాద్)
క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించినందుకు బహుమతి: ఆర్‌జీ నాదకర్ణి, ఫరూక్ ఇంజినీర్, సోల్కర్(ఒక్కొక్కరికి రూ. 15 లక్షల బహుమతి)

అశోక్ చక్ర :
శాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర (మరణాంతర) ఆంధ్రవూపదేశ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వి. ప్రసాద్‌బాబుకు దక్కింది.

పవర్ అవార్డు :
ఆంధ్రవూపదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్(ఏపీ జెన్‌కో) మేనేజింగ్ డైరెక్టర్ కె. విజయానంద్‌కు ఇండియా పవర్ అవార్డు లభించింది. ఆంధ్రవూపదేశ్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో చూపిన ప్రతిభకుగాను ఆయన 2013 ఉత్తమ సీఈఓగా ఎంపికయ్యారు.

నోబెల్ బహుమతులు- 2013
శాంతి: ప్రపంచవ్యాప్తంగా రసాయన ఆయుధాల నిర్మూలనకు కృషి చేస్తున్న ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ (ఓపీసీడబ్లూ)కు లభించింది. 1901 నుంచి 2013 వరకు నోబెల్ శాంతి బహుమతి 94 సార్లు 125 మందికి బహూకరించారు. 2012 శాంతి బహుమతి యూరోపియన్ యూనియన్‌కు లభించింది.
సాహిత్యం: కెనడా రచయిత్రి ఆలిస్ మన్రో(82)కు నోబెల్ సాహిత్య బహుమతి దక్కింది. కెనడియన్ చెహూవ్‌గా పిలిచే మన్రో తన కథా రచనల్లో సమకాలిన పరిస్థితులును, మానవ సంబంధాలను మేళవించి పాఠకులకు అందించింది. ఆలిస్ మన్రో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన 13వ మహిళ, కెనడాకు చెందిన తొలి మహిళ కూడా.

ఇందిరాగాంధీ శాంతి బహుమతి :
జర్మనీ చాన్సలర్ ఏంజిలా మెర్కల్ 2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతికి ఎంపికయ్యారు.

సంగీత నాటక అకాడమీ అవార్డులు 
ప్రముఖ కర్నాటక విద్వాంసుడు డీ రాఘవాచారి, టీ శేషాచారి ఈ ఏడాది సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. హైదరాబాద్ బ్రదర్స్‌గా వీరు సుపరిచితులు.

No comments:

Post a Comment